ప్రకాశం: కనిగిరి అమరావతి గ్రౌండ్లో ఈ నెల 18న ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు క్యాంపు కార్యాలయ ప్రతినిధి తిరుమల తెలిపారు. శంకర కంటి ఆసుపత్రి, జిల్లా అంధత్వ నివారణ సంస్థల సంయుక్తంగా ఈ శిబిరం జరుగనుంది. రోగులకు ఉచితంగా కంటి పరీక్షలు చేసి, అవసరమైన వారికి కంటి అద్దాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.