కాకినాడ: జిల్లాలోని ఏలేశ్వరం నగర పంచాయతీకి ప్రభుత్వం గ్రేడ్-2 పురపాలిక హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆదాయం, జనాభా ప్రమాణాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం 20 వార్డులతో సుమారు 39 వేల జనాభా ఉన్న ఈ పట్టణంలో వార్డులను 28కి పెంచే యోచనలో అధికారులు ఉన్నారు.