PPM: గుమ్మలక్ష్మీపురంలో జనగణన మొదటి విడత సర్వేను సిబ్బంది ఖచ్చితంగా నిర్వహించాలని ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి సూచించారు. శనివారం జడ్పీ హైస్కూల్లో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్నిఆమె పరిశీలించారు. ప్రతి ఇంటిని సందర్శించి తప్పుల్లేని సమాచారాన్ని సేకరించాలని ఆదేశించారు. దేశ అభివృద్ధికి జనగణన కీలకమని ఆమె పేర్కొన్నారు.