KRNL: తుగ్గలి మండలంలోని పలు గ్రామాలలో రైతులు ‘నేలమ్మ.. నేలమ్మ.. నేలమ్మా.. నీకు వేలవేల వందనాలమ్మా..’ అంటూ శ్రీ పరాభవనామ సంవత్సరం మొదటి రోజు గురువారం వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. ‘పరాభవ నామ సంవత్సరమా.. రైతుల ఇంట సిరులు పండించమ్మా..’ అని రైతులు ఎన్నో ఆశలతో దుక్కిదున్ని, పొలం పనులకు బయల్దేరి వెళ్లారు. తమకున్న వృషణాలతో పాలాల్లో సేద్యం పనులను ప్రారంభించారు.