PPM: పార్వతీపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రేపు మండల సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో కొండపల్లి సత్యం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. అయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొనాలని కోరారు . మండలానికి సంబంధించి అధికారులందరూ ప్రగతి నివేదికతో కార్యక్రమంలో పాల్గొనాలని అధికారులను ఆదేశించారు.