NDL: శ్రీ కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి బనగానపల్లె మండలం పలుకూరు గ్రామానికి చెందిన ఉప్పరి సుబ్బరాయుడు కుటుంబ సభ్యులు కేజీ వెండి నాగపడగ(రూ.3.50 లక్షలు)తో పాటు సుమారు రూ.70 వేల విలువైన నిత్యావసర సరుకులు విరాళంగా ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, దాతలకు ఆలయ మర్యాదలతో తీర్థప్రసాదాలు అందజేశారు.