SS: జిల్లాకు చెందిన మహిళా నేతలు మంత్రి సవిత, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, శ్రావణి, సింధూరరెడ్డి CM చంద్రబాబు నాయుడిని కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆర్డీటీ సంస్థకు సంబంధించిన ఎఫ్సీఆర్ఏ (FCRA) విదేశీ నిధుల పునరుద్ధరణకు ప్రభుత్వం చేసిన కృషిపై వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని శాలువాతో సన్మానించి ధన్యవాదాలు తెలియజేశారు.