ATP: కళ్యాణదుర్గంలోని ఆర్అండ్బీ డివిజనల్ కార్యాలయాన్ని శ్రీసత్యసాయి జిల్లాకు తరలించడం సరికాదని YCP జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రజల సౌకర్యార్థం ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. హిందూపురానికి ఆర్అండ్బీ సిబ్బందిని, కార్యాలయాన్ని తరలించవద్దని ఆయన డిమాండ్ చేశారు.