సత్యసాయి: హిందూపురంలోని ఆటో నగర్లో నూతన రోడ్లు, కాలువల నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ రమేశ్ కుమార్, ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శులు డాక్టర్ సురేంద్ర, బాలాజీ పాల్గొని పనులు ప్రారంభించారు. ఈ పనులను రూ.2 కోట్ల వ్యయంతో చేపడుతున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.