ATP: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారంతో ప్రశాంతంగా ముగిశాయి. చివరి రోజు ద్వితీయ సంవత్సరం కెమిస్ట్రీ పరీక్షకు 16,162 మంది విద్యార్థులు హాజరు కాగా, 247 మంది గైర్హాజరయ్యారు. పరీక్షల నిర్వహణ కమిటీ కన్వీనర్ వెంకటరమణనాయక్, ఇతర అధికారులు పలు కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్షలు ముగియడంతో విద్యార్థులు స్వగ్రామాలకు బయలుదేరారు.