NDL: శ్రీశైల క్షేత్రంలో ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న ఉగాది ఉత్సవాలపై దేవస్థానం ఛైర్మన్ రమేశ్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు రెండో విడత సమన్వయ సమావేశం నిర్వహించారు. కర్ణాటక, మహారాష్ట్రల నుంచి భారీగా తరలివచ్చే పాదయాత్ర భక్తులకు కల్పించాల్సిన వసతులు, తాగునీరు, భద్రతపై స్వచ్ఛంద సంస్థలతో చర్చించారు.