కృష్ణా: చల్లపల్లి మండలం వక్కలగడ్డ గ్రామం ప్రజలకు ఎస్సై దుర్గంజనేయులు సైబర్ నేరాలపై సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలియని వ్యక్తులకు వోటీపీలు, బ్యాంకు వివరాలు, ఆధార్ నంబర్లు వంటి వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని తెలిపారు.