NDL: వీబీజీ రామ్ జీ పథకంతో శ్రామికులకు 125 రోజుల పని దినాలు కల్పించడం జరుగుతుందని ఎంపీడీవో మధుసూదన్ రెడ్డి తెలిపారు. వెలుగోడు ఎంపీడీవో కార్యాలయంలో వీబీజీ రామ్ జీ పథకం కరపత్రాలు, వాల్ పోస్టర్లను విడుదల చేశారు. వారు మాట్లాడుతూ.. ప్రజలలో, రైతులలో అవగాహన పెంచే విదంగా ఆరు వారాల ప్రజా చైతన్య కార్యక్రమాల ప్రణాళికను ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు.