ASR: మార్చి నెల 1వ తేదీ ఆదివారం కావడంతో ఈనెల 28న శనివారం లబ్ధిదారులకు పెన్షన్ సొమ్ము పంపిణీ చేయడం జరుగుతుందని కొయ్యూరు ఎంపీడీవో జీడీవీ ప్రసాదరావు మంగళవారం తెలిపారు. మండలంలో 7,457 మంది పెన్షన్ లబ్ధిదారులకు రూ.3,12,79,000 సొమ్ము మంజూరైనట్లు తెలిపారు. ఈనెల 27న బ్యాంకుల నుంచి పెన్షన్ సొమ్మును విత్ డ్రా చేయాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు.