ATP: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సాధన కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని శింగనమల నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త సాకే శైలజానాథ్ పిలుపునిచ్చారు. కర్నూలులో ఎస్వీ మోహన్ రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన ‘సాగునీటి ప్రాజెక్టులు-సమాలోచన’ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాజెక్టుతోనే ప్రాంతీయ నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.