అనంతపురం: గుంతకల్లు మండలం నాగసముద్రం విద్యుత్ డీపీ షార్ట్ సర్క్యూట్ కారణంగా గుర్రాబ్బడు టర్నింగ్ సమీపంలోని రైతు నాగేంద్ర (సర్వే నెం: 449-A)కు చెందిన రెండు ఎకరాల చిని తోటలో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సుమారు 50 చెట్లు కాలిపోగా, రూ. 2 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధిత రైతు వేడుకుంటున్నారు.