అన్నమయ్య: రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా రవాణా శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. 976 బస్సులను చెక్ చేసి పత్రాలు లేని 193 బస్సులపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించారు. చెక్ పోస్టులు కలిపి 16 పాయింట్లలో ఈ తనిఖీలు నిర్వహించారు. అధిక లోడ్తో నడుస్తున్న ప్రైవేట్ బస్సులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి హెచ్చరించారు.