కోనసీమ: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కోరుతూ టీడీపీ నేత గొల్లపల్లి అమూల్య మంగళవారం మామిడికుదురు అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శస్త్రచికిత్స అనంతరం ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజా సేవలోకి రావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రమిస్తున్న పవన్ కళ్యాణ్ క్షేమం కోరుతూ కూటమి నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.