అన్నమయ్య: లక్కిరెడ్డిపల్లి మండలంలో శుక్రవారం వడదెబ్బతో రామాంజనేయులు (36) అనే యువకుడు మృతి చెందాడు. భార్యతో విభేదాల కారణంగా ఒంటరిగా నివసిస్తూ, మద్యానికి బానిసైన రామాంజనేయులు, శుక్రవారం వడదెబ్బకు గురై గ్రామ సమీపంలో పడి ఉన్నాడు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా, వారు చేరుకుని పరిశీలించేలోపే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు.