NRPT: జిల్లాలో మిషన్ భగీరథ నీటి సరఫరా సోమవారం సాయంత్రం నుంచి రెండు రోజులపాటు నిలిపివేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. మరికల్ మండల కేంద్రంలో పైపులైన్ పగిలిపోవడంతో మరమ్మతులు చేయనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని 245 గ్రామాలకు, దేవరకద్ర, నారాయణపేట, మక్తల్ మున్సిపాలిటీలకు సరఫరాలో అంతరాయం కలగనుంది. ప్రజలు సహకరించాలని కోరారు.