జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద ఇవాళ్టి నుంచి నగదు చెల్లింపులు పూర్తిగా నిలిచిపోనున్నాయి. ఇకపై ఫాస్టాగ్ లేదా UPI ద్వారానే రుసుము చెల్లించాలి. రద్దీ తగ్గించి, ప్రయాణ సమయాన్ని ఆదా చేసేందుకు NHAI ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ముందే ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకోవాలని, డిజిటల్ చెల్లింపులకు సిద్ధంగా ఉండాలని అధికారులు సూచించారు.