AKP: నాతవరం మండలం శృంగవరం పంచాయతీకి జాతీయ స్థాయిలో అవార్డు లభించింది. సుపరిపాలనలో ఈ పంచాయతీ జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. కేంద్ర బృందం గత నెల 8న గ్రామాన్ని సందర్శించి ఉపాధి హామీ కూలీల హాజరు నమోదు, ఎరువులు విత్తనాలు పంపిణీ, ధాన్యం సేకరణ, సచివాలయాల్లో ఏపీ సేవా పోర్టల్ ద్వారా సేవలను అందించడం తదితర అంశాలను పరిశీలించింది.