అమెరికా టెక్ దిగ్గజం ఒరాకిల్ ఒకేసారి 30 వేల మంది ఉద్యోగులపై వేటు వేసింది. ఇందులో 12 వేల మంది భారత్లో పనిచేస్తున్నవారే కావడం గమనార్హం. ఇంకా మేనేజింగ్ హోదాలో ఉన్నవారినే ఎక్కువగా తొలగించినట్లు తెలుస్తోంది. కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా వారి రోల్స్ ఇక అవసరం లేదని సదరు ఉద్యోగులకు మెయిల్లో తెలిపినట్లు సమాచారం. మరోసారి లేఆఫ్స్ ఉంటాయనే వార్తలూ వినిపిస్తున్నాయి.