NGKL: తెలకపల్లి మండలం ఆలేరులో హరితహారం మొక్కలను నరికివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు అదనపు కలెక్టర్ దేవసహాయంకు ఫిర్యాదు చేశారు. సర్పంచ్ ఆనంద్, కార్యదర్శి మహేశ్ సహకారంతో గట్టు బాలిశ్వరయ్య అనే వ్యక్తి మొక్కలను నరికినట్లు వారు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.