KRNL: గతేడాది నన్నూరు సమీపంలో విద్యుత్ షాక్కు గురై మృతి చెందిన మునగాలపాడు గ్రామానికి చెందిన TDP కార్యకర్త అర్జున్ కుటుంబసభ్యులను ఇవాళ మంత్రి లోకేష్ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి పిలిపించారు. అర్జున్ తల్లిదండ్రులు మద్దిలేటి, రాణి, సోదరి కోమలితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు.