AP: వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఓటర్ లిస్టు పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి సూచించారు. ‘మనకు అనుకూలమైన ఓట్లను తీసివేసే అవకాశం ఉంది. అందరూ అప్రమత్తంగా ఉండండి. మాజీమంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని, జోగి రమేష్ ఇళ్లపై దాడి చేశారు. ప్రభుత్వం ఎన్ని దాడులు చేసినా మన నాయకులు ఎక్కడా భయపడలేదు’ అని పేర్కొన్నారు.