KMR: ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు ఎంతో రుణపడి ఉంటామని లింగంపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నారా గౌడ్ అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మండలానికి కోటి రూపాయల ఎన్ఆర్జీఎస్ నిధులు మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ ప్రసాద్ గౌడ్ తదితర నాయకులు పాల్గొన్నారు.