VZM: బొండపల్లి మండలం రయింద్రం గ్రామంలో పైడితల్లి అమ్మవారి వనం గుడి వద్ద వెదురు పొదలలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వెదురు పొదులు కాలిపోయినట్లు గజపతినగరం అగ్నిమాపక కేంద్రం అధికారి రవి ప్రసాద్ తెలిపారు. అ జాగ్రత్తగా పొగ తాగి పడివేయడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.