KNR: కరీంనగర్ వన్ టౌన్ స్టేషన్ ఎదుట కేడీసీసీ బ్యాంకు వద్ద ట్రాఫిక్ పోలీసులు“అరైవ్-అలైవ్” కార్యక్రమం నిర్వహించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, ట్రాఫిక్ నియమాలు పాటించాలని ఎస్సైలు ప్రసాద్, సురేష్, చిన్న నాయక్ అవగాహన కల్పించారు. నిబంధనలు పాటించడం ద్వారానే ప్రాణాలను కాపాడుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో, టాక్సీ డ్రైవర్లు, తదితరులు ఉన్నారు.