NDL: బేతంచెర్ల మండలంలోని శ్రీ మద్దిలేటి స్వామి క్షేత్రంలో ఇవాళ బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఉప కమిషనర్ ఎం.రామాంజనేయులు సోమవారం తెలిపారు. సప్లయర్, గ్రైండర్, బొమ్మల అంగడి సహా పలు షాపుల నిర్వహణ హక్కులకు వేలం జరుగుతుందని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు దేవస్థానం నిబంధనల మేరకు పాల్గొనాలని సూచించారు. భక్తుల సౌకర్యం దృష్ట్యా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.