TG: అసెంబ్లీలో చర్చ సందర్భంగా మంత్రులు ‘గాలి తిరుగుడు’ తిరుగుతున్నారన్న BJP నేత మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు గందరగోళానికి దారితీశాయి. భట్టి, పొన్నం ఈ పదజాలాన్ని ఖండించి, ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్ కూడా దీనిపై సీరియస్ అయ్యారు. దీంతో స్పీకర్ సూచనతో, తన వ్యాఖ్యలు తప్పుగా అర్థమైతే వెనక్కి తీసుకుంటానని మహేశ్వర్ రెడ్డి అన్నారు.