VZM: ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం ఉంటేనే అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతమవుతాయని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనిత తెలిపారు. కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు సంతృప్తికరమైన పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. వేసవిలో త్రాగునీటి కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.