JN: పాలకుర్తి పోలీస్ స్టేషన్ సర్కిల్ పరిధిలో వివిధ వాహన డ్రైవర్లకు ఏర్పాటు చేసిన ‘అరైవ్ -అలైవ్’ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏసీపీ అంబటి నర్సయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ ఒక్క డ్రైవర్ కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సీఐ జానకి రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.