KNR: గంగాధర మండలం ఉప్పర మల్యాలలో నీటి కొరతతో ఎండిపోయిన పంట పొలాలను రాజ్యాధికార పార్టీ నాయకుడు కొప్పుల వెంకటేష్ సందర్శించారు. చెరువుకు చేరువలో ఉన్నా సాగునీరు అందక పంటలు ఎండిపోవడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 30 వేల చొప్పున పరిహారం అందించి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.