SKLM: ఏపీ చెస్ ఇన్ స్కూల్స్ కమిటీ జిల్లా కన్వీనర్గా టెక్కలికి చెందిన సనపల భీమారావును నియమించారు. ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ చెస్ ఇన్ స్కూల్ కమిటీలు సభ్యుడిగా వ్యవహరిస్తున్న భీమారావు రాష్ట్ర కమిటీ కన్వీనర్గా నియమించడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ.. ప్రతి స్కూల్లో చదరంగం వ్యాప్తికి కృషి చేస్తానని అన్నారు.