నంద్యాల జిల్లా బేతంచర్లలో రాజకీయంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ప్రభావంతో వైసీపీకి చెందిన సుమారు 100 కుటుంబాలు టీడీపీలో సోమవారం చేరాయి. బుగ్గన ప్రసన్న లక్ష్మీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కొత్త సభ్యులను ఆహ్వానించారు. ఈ చేరికలతో స్థానిక రాజకీయ సమీకరణాలు మారే సూచనలు కనిపిస్తున్నాయి.