MLG: మున్సిపల్ కార్మికులకు రూ.22,750 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెం కమిషనర్, మేయర్కు వినతిపత్రం అందజేశారు. సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి భూక్యా రమేష్ మాట్లాడుతూ.. కార్మికుల సంఖ్య పెంచి రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. చిన్నచూపు చూస్తే పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీపీఎం కార్పొరేటర్ చింతలపూడి శ్రావణి తదితరులు పాల్గొన్నారు.