TPT: నాయుడుపేటలో టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవం అనంతరం నిర్వహించిన ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విస్తృతంగా ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. 2.5 లక్షల ఇళ్ల సామూహిక గృహప్రవేశాలతో లక్షలాది కుటుంబాలకు భద్రమైన నివాసాన్ని కల్పిస్తున్నామని పేర్కొన్నారు.