సత్యసాయి: పెనుకొండ నియోజకవర్గంలో మంత్రి సవిత రేపు పర్యటించనున్నట్లు ఆమె పార్టీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఉదయం 10 గంటలకు పెనుకొండ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో భువన విజయం సమావేశ మందిరంలో ఇండక్షన్ స్టవ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం ఉదయం 10:30 గంటలకు అదే ప్రాంగణంలో స్వచ్ఛరథాలను ప్రారంభించనున్నారు.