BHNG: ‘ప్రజావాణి’లో వచ్చిన అర్జీలను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖకు చెందినవి 25, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖకు 2, హౌసింగ్ శాఖకు 2, మున్సిపాలిటీకి 1 చొప్పున అర్జీలు వచ్చినట్లు తెలిపారు.