KKD: తుని మండలం లోవ క్షేత్రంలో తలంపులమ్మ వెలిశారు. దేశంలో ఉత్తరాది, దక్షిణాదిలో ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలో ఎస్కలేటర్ ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. రూ.4.5 కోట్లతో నిర్మిస్తున్న ఎస్కలేటర్ పనులు పూర్తి కావచ్చాయని పేర్కొన్నారు. భక్తులు కొండ ఎక్కేందుకు వీలుగా ఏర్పాటు చేస్తున్నామని ఈవో తెలిపారు. ఇంత వరకు దేశంలో ఏ ఆలయానికి ఎస్కలేటర్ లేదని ఆయన తెలిపారు.