BDK: వేసవి తీవ్రత దృష్ట్యా మణుగూరు నుంచి హైదరాబాద్ వరకు ఆర్టీసీ ఏసీ బస్సులను నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. ప్రస్తుతం మణుగూరు నుంచి నాన్-ఏసీ బస్సులు మాత్రమే అందుబాటులో ఉండటంతో ఎండల సమయంలో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ యాజమాన్యం స్పందించి, ప్రయాణికుల సౌకర్యార్థం ఏసీ సర్వీసులను అందుబాటులోకి తేవాలని ప్రయాణికులు కోరుతున్నారు.