HYD: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ కమిషనర్ శ్రీజన నేరుగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజావాణిలో 39 ఫిర్యాదులు అందినట్లు ఆమె పేర్కొన్నారు. వాటిని వెంటనే పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు ఆమె ఆదేశాలు జారీ చేశారు.