AP: పల్నాడు జిల్లా పోనుగోటివారిపాలెంలో వాంతులు, విరేచనాలతో 20 మందికి పైగా గ్రామస్తులు అస్వస్థతకు గురయ్యారు. నరసరావుపేట, ముప్పాళ్ల ఆస్పత్రుల్లో అతిసార బాధితులు చికిత్స పొందుతున్నారు. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటుచేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. గ్రామంలో అతిసార ఆనవాళ్లు లేవన్న Dy. DMHO తెలిపారు. గ్రామంలో వైద్య సిబ్బందితో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నామని వెల్లడించారు.