VKB: వికారాబాద్ మహాత్మా జ్యోతిబా ఫులే (ఎంజేపీ) బాలుర గురుకుల విద్యార్థి సాయి కిరణ్ సోమవారం జాతీయస్థాయిలో సత్తా చాటాడు. బెంగళూరులో జరిగిన క్రీడా పోటీల్లో షాట్పుట్ విభాగంలో బంతిని 17 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంతో రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ ఘనత సాధించిన సాయి కిరణ్ను ఎంజేపీ పాఠశాల ఉపాధ్యాయులు, స్థానికులు ఘనంగా అభినందించారు.