PDPL: కమాన్పూర్ మండలం రొంపికుంట గ్రామంలో శివాజీ యువసేన ఆధ్వర్యంలో సోమవారం చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలకు తాగునీరు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రారంభోత్సవంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాస్ యాదవ్, మాజీ సర్పంచ్ రవీందర్, తదితరులు పాల్గొన్నారు.