NDL: డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి బేతంచర్లలో నూతన గృహాన్ని ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల గృహ ప్రవేశాల కార్యక్రమంలో భాగంగా ఆయన పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం నుంచి అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం హయాంలో గృహ నిర్మాణాలు వేగవంతం చేస్తామన్నారు.