AP: నక్సల్స్ ఫ్రీ స్టేట్గా ఏపీ మారిందని డీజీపీ హరీష్ గుప్తా తెలిపారు. 9 మంది మావోయిస్టులు లొంగిపోయారని చెప్పారు. దళంతో కలిసి కేంద్ర కమిటీ సభ్యుడు నారాయణరావు అలియాస్ సోమన్న లొంగిపోయాడని, ప్రభుత్వం తరఫున అన్ని రకాల బెనిఫిట్స్ అందిస్తామన్నారు. నారాయణరావుకు రూ.25 లక్షలు ప్రభుత్వం నుంచి అందిస్తున్నామని, మిగితా మావోయిస్టులకు రూ.24.20 లక్షలు ఇచ్చినట్లు వెల్లడించారు.