విశాఖ మేఘాద్రి గెడ్డ రిజర్వాయర్లో విషాదం చోటుచేసుకుంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలానికి చెందిన నితిన్ (బీటెక్ 3వ సంవత్సరం) స్నేహితులతో కలిసి ఆదివారం అక్కడికి వెళ్లాడు. ఈతకు దిగిన సమయంలో జారి నీటిలో మునిగి మృతి చెందాడు. మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు. పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.