WGL: నల్లబెల్లి మండలంలోని ఆర్షనపల్లి, ధర్మారావుపల్లి గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులను స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలు ప్రారంభించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ముందుకు సాగుతుందని, అభివృద్ధికి ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.